వైఎస్ జగన్ ప్రభుత్వం కూలిపోబోతోందని స్వయంగా ఆ పార్టీ నేతే కామెంట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేత మరెవరో కాదు.. నిత్యం వైఎస్సార్సీపీపై, ప్రభుత్వంపై ఏదొక రకంగా కామెంట్స్ చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.
ఈయన గత కొంత కాలం నుండి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో పూర్తిగా దూరమైనట్లేనని భావించవచ్చు. ఒక ప్రముఖ దినపత్రికలో న్యాయదేవతపై నిఘా అని వచ్చిన కథనానికి ఎంపీ స్పందిస్తూ న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ అనేది కనుక నిజమైతే అది జగన్ ప్రభుత్వానికి నిజంగా పెద్ద దెబ్బ అని అన్నారు. జగన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. తన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు రఘురామ కృష్ణంరాజు.