Raghuramakrishnamraju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ పైకి మరో బాణం వేశారు. ఈ సారి జగన్ తో పాటూ.., సీబీఐ, ఈడీని కూడా కోర్టుకి లాగేలా వేశారు. ఈ ఎత్తు ఎంత వరకు పారుతుంది..? ఈయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది కోర్టులు తేల్చనున్నాయి. ఇక సూటిగా విషయంలోకి వెళ్ళిపోతే.. రఘురామా ఈరోజు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసారు. “జగన్ అక్రమాస్తుల కేసుని సీబీఐ, ఈడీ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని.., దర్యాప్తులో బయటకు వచ్చిన అనేక అంశాలను వదిలిపెట్టాయని.., అర్ధారంతరంగా ముగించకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జగన్ కి వ్యతిరేకంగా కోర్టులో వరుసగా కేసులు వేస్తున్న రఘురామ.. ఇది ఆరో పిటిషన్. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలనీ.. ఏపీ సీఐడీ పోలీసులు తనను కొట్టారని దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని.. అమూల్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా.., వరుసగా పిటిషన్లు వేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రెబల్ ఎంపీ, వైసీపీ మధ్య అగాధం మరింత ముదురుతోంది. ఓ వైపు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ దశలో ఉండగానే.. ఇప్పుడు ఈ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది..
Raghuramakrishnamraju: సీబీఐ కౌంటర్ కీలకం..!
ఈ కేసుని హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది అనుమానమే.. రఘురామా లేవనెత్తిన పాయింట్లు వ్యవస్థీకృతమైనవి కావడంతో కోర్టు విచారణకు స్వీకరిస్తుందా..? లేదా సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తుందా అనేది కీలకం కానుంది. ఏది జరిగినా ఒకవేళ సీబీఐ కోర్టుకి పిటిషన్ వెళ్లినా అక్కడ కూడా సీబీఐ వేయనున్న కౌంటర్ కీలకం కానుంది. మొదటి నుండి కేసులు దర్యాప్తు జరిపిన తీరు, ఈ ఏడేళ్ల విరామంలో చేసిన విచారణ అన్నిటినీ నివేదిక రూపంలో కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. సో.. ఈ కేసుల్లో సీబీఐతో పాటూ ఈడీ వేయనున్న కౌంటర్ల ఆధారంగా జగన్ కేసుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.