TFI: టాలీవుడ్ స్థాయి బాహుబలి తర్వాత ఎంతో పెరిగిపోయింది. సాహో మొదలుకొని మొన్న వచ్చిన పుష్ప వరకు దేశంలోని ఇతర భాషల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న తెలుగు ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. భారీ బడ్జెట్ పెట్టి అత్యున్నత సాంకేతిక విలువలతో తీస్తున్న ఈ సినిమాల విషయంలో. ప్రొడ్యూసర్లు ఏ మాత్రం తగ్గడం లేదు.
అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నాడని ఖచ్చితమైన వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తో పులి సినిమా తర్వాత రెహమాన్ ఇప్పటి వరకు నేరుగా ఒక తెలుగు సినిమా చేయలేదు.
అలాగే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా విజయ్ దేవరకొండ తో సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని మొదట మహేష్ బాబు కోసం పూరి రాసుకున్నారు. అయితే విజయ్ తో లైగర్ చేస్తున్న పూరి జగన్నాథ్ పనిలో పని జనగణమన కూడా వినిపించి అతనిని మరొక సినిమాకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా ఏఆర్ రెహమాన్ నే సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారట.
రెహమాన్ భారతదేశంలోనే కొన్ని దశాబ్దాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. పైగా బాలీవుడ్ కాకుండా ప్రాంతీయ భాషల్లో అతను సంగీతదర్శకుడిగా ఈ మధ్య కాలంలో తరచూ సినిమాలు కూడా చేయలేదు. అయితే తెలుగువారు రెహమాన్ తీసుకునే అత్యధిక పారితోషికం కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ సినిమాలను చాలా సులువుగా తమ క్వాలిటీతో బాలీవుడ్ సినిమాలను దాటేస్తున్నాయి.
ఇక రెహమాన్ లాంటి సంగీత దర్శకుడితో సినిమాలు ప్లాన్ చేస్తున్న తెలుగు దర్శకులు ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సాయంతో భారతదేశంలోనే అతి పెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ గా టాలీవుడ్ ను నిలిపేందుకు సిద్ధమైపోయారు అనే చెప్పాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!