కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టన భారత్ జోడో యాత్ర ఏపిలోకి ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర ఇవేళ కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం నుండి ప్రారంభమై ఏపిలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టింది. సత్యసాయి జిల్లా ఓబులాపురంలో రాహుల్ పాదయాత్రకు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తులశిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం పాదయాాత్ర డి హీరేహాళ్ చేరుకుంది. డీ హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఇక్కడ సాయంత్రం వరకూ రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభం అవుతుంది. అనంతపురం జిల్లా ఓబులాపురం గ్రామం మీదుగా రాత్రికి బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపానికి చేరుకుని అక్కడ రాహుల్ బస చేస్తారు.ఈ రోజు దాదాపు 12 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది.
రాహుల్ పాదయాత్ర ఏపిలో నాలుగు రోజులు సాగి తిరిగి కర్ణాటకకు వెళుతుంది. ప్రతి రోజు 6.30 గంటలకు బయలుదేరి పదిన్నర గంటలకు విరామాన్ని తీసుకుంటున్నారు. భోజనం అక్కడే చేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 7.30 గంటల వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన కనబడుతోంది. ఈ నెల 23 నుండి తెలంగాణలో జోడో యాత్ర కొనసాగుతుంది.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జగన్ సమావేశం..ఎందుకంటే..?