కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా నిర్వహించతలపెట్టిన భారత్ జోడో యాత్ర నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం అయిదు గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుగా ఈ ఉదయం శ్రీపెరుంబుదూర్ (తమిళనాడు) లో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. తన తండ్రి రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ గాంధీ ఈ స్మారకం వద్ద కు రావడం ఇదే తొలి సారి. తండ్రికి అంజలి ఘటించిన రాహుల్ గాంధీ .. తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాలకు, మాజీ సీఎం కామరాజ్ స్మారకాన్ని సందర్శిస్తారు.
సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపి కేబినెట్ భేటీ
ఆ తర్వాత మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జాతీయ జండాను రాహుల్ కు అందించి యాత్రను ప్రారంభిస్తారు. యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, చత్తీశ్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్, కన్యాకుమారి నుండి జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ వరకూ ఈ జోడో యాత్ర జరుగనుంది. ఈ యాత్రలో రాహుల్ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఈ రోజు లాంఛనంగా ప్రారంభించినా రేపటి నుండి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆయన వెంట 117 మంది నేతలు పాల్గొంటారు. ఈ యాత్ర అయిదు నెలల పాటు సుమారు 3,570 కిలో మీటర్లు సాగనుంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తొంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా ఈ యాత్ర వెళుతుంది.
Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు..ఎందుకంటే..?