స్మార్ట్ సిటీల కోసం ఇది అవసరం
అమలు చేస్తానన్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మేయర్లకు ఇక ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి మంచి నాయకులు కావాలని, అందుకే ప్రత్యక్ష ఎన్నిక అవసరమని అన్నారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలు కడతామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తెలిపింది. వాటిలో 98 ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ. 500 కోట్లు కేటాయించింది. వాటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నగరాల్లో జీవన నాణ్యత పెంచాలంటే ఐదేళ్ల పాటు ఉండేలా ప్రత్యక్షంగా ఎన్నుకునే మేయర్లుండాలని రాహుల్ అన్నారు. మేయర్, కౌన్సిల్ కు సమాధానంగా ఉండే నిపుణులు పాలన చూసుకుంటారని చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 2016 జనవరిలో 20 నగరాలను ప్రకటించారు. ఆ తర్వాత వివిధ దశలలో మరికొన్నింటిని ప్రకటించారు. మొత్తం అన్నింటికీ కలిపి రూ. 2.03 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు.
Today, there are 22 Lakh job vacancies in Government.
We will have these vacancies filled by 31st March, 2020.
Devolution of funds from the Center to each State Govt for healthcare, education etc. will be linked to these vacant positions being filled.
— Rahul Gandhi (@RahulGandhi) March 31, 2019
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించేలోపు రాహుల్ ఒక్కో విషయం చెబుతూ వచ్చారు. న్యాయ్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 72 వేలు, 10 నెలల్లో 22 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ తదితరాలు తెలిపారు. గత రెండేళ్లుగా నిరుద్యోగం ఎక్కువ అవుతుండటంతో దానిపై రాహుల్ ప్రత్యేక దృష్టిపెట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ సీనియర్ నేత రాజీవ్ గౌడ అన్నారు. దానిపై దృష్టిపెట్టామని తెలిపారు.