హతవిధీ విధి(నిధి) ఎంత బలీయమైనది..?? ఆ ఫోటో ఎంత పని చేసినది..?? ఒక్క సంతకం ఎన్ని తిప్పలు తెచ్చినది..?? రాహుల్ గాంధీ అనే నోటికి ఒక్క ఫోటోనే రిమోట్ గా మారి “మ్యూట్” బటన్ నొక్కేసింది..! పాపం “రాహులా… రాహులా… నిన్నాగం చేసిండ్రరో”
ఏమిటిదీ…! ఏమిటీ వైపరీత్యము..!!? “నేడు చైనాతో ఏల చిక్కు రావాలె..? వచ్చినదిపో రాజకీయంగా వాడుకుందామని రాహుల్ కేల ఆలోచన రావాలె..?? వచ్చినదిపో.. మోడీపై నోరు ఏల మెదపవలె..?? మెదిపితిడిపో “పన్నెండేళ్ల కిందటి ఫోటో ఆ బిజెపి వాళ్లకు ఏల చిక్కవలె..?? చిక్కినదిపో “రాహుల్ ఏల దానిలో సంతకం చేయవలె..”?? చేసాడుపొ.. “వెనుక ఏల జిన్ పింగ్ నిల్చుని ఉండవలె..?? ఇవేమి సమాధానం ఇవ్వలేని ప్రశ్నలుగా మిగిలినవి. రాహుల్ నోటికి తాళం, కాంగ్రెస్ గూటికి కళ్లెం.. బిజెపి నోటికి పెద్ద బాకా…!!
ఇంతకు విషయం ఏమిటో గ్రహించే ఉంటారు…!!
చైనాతో గొడవ నేపథ్యంలో రాహుల్ గాంధీ మోడీపై వరుసగా విరుచుకుపడ్డారు. మోడీ పాలన బాలేదంటూనే, లడక్.., గాల్వాన్ లోయ విషయంలో మోడీ సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. సరే ప్రతిపక్షం కదా కామన్ అనుకుని బిజెపి మొదట్లో వదిలేసింది…! ఇంతలోనే బిజెపి నాయకుడు మహేష్ జట్మలానికి ఓ ఫోటో దొరికింది. అందులో రాహుల్ గాది చైనీయులతో ఓ ఒప్పందంపై సంతకం చేస్తున్న ఫోటో అది. ఆ ఫొటోలో ఇటు సోనియా గాంధీ, అటు జిన్ పింగ్ ఉన్నారు. అది బిజెపికి పెద్ద ఆయుధంగా మారింది. చైనాతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అంటూ రచ్చ మొదలెట్టింది.
అది ప్రైవేట్ నిధులు…!
లోపల విషయం ఏమిటా అంటూ ఆరా తీస్తే.. “రాజీవ్ గాంధీ పేరిట ఒక ఫౌండేషన్ ఉంది. దానికి విదేశాల నుండి కూడా నిధులు వ్సస్తుంటాయి. దీనికి చైనాలోని జిన్ పింగ్ అధ్యక్షుడిగా ఉన్న కమ్యూనిష్టు పార్టీ నుండి కూడా నిధులు వచ్చాయి. ఆ నిధుల ఒప్పంద పత్రాలపైనే సంతకాలు చేస్తున్న ఫోటో అది. ఏది ఏమైనా రాహుల్ కి, చైనాకి ఎంత ప్రఘాడ సంబంధం అనేది దొరికేసాడు. అందుకే ఇక ఏమి మాట్లాడలేక సైలెంట్ అయ్యారు. ఇదన్నమాట “రాహులా… రాహులా… నినాగం చేసిండ్రురో” అంటే….!!