గోవా, జనవరి29: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం ఆయన పారికర్ కార్యాలయానికి వెళ్ళి కలిశారు. కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి ప్యాంక్రియాస్ గ్రంధికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పారికర్ ఇంట్లో రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయన్న అంశంపై మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రస్నించిన మరుసటి రోజునే రాహుల్ గోవా ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లడం గమనార్హం. అయితే ఈ పర్యటనను రాహుల్ వ్యక్తిగతమైనదిగా పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రఫేల్ డీల్కి సంబంధించిన కీలక పత్రాలు పారికర్ వద్ద ఉన్నాయని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె చెబుతున్నట్లున్న ఆడియో టేప్ కొన్నాళ్ల క్రితం బయటకు వచ్చింది. ఆయన రక్షణ మంత్రి గా ఉన్నప్పుడే ఆ డీల్ జరిగింది. అందువల్లనే పారికర్ను బిజెపి నాయకత్వం ఏమీ చేయలేకపోతున్నదనీ, పారికర్ ఎంత అనారోగ్యంతో ఉన్నా ఆయనను పదవి నుంచి తప్పించలేక పోతున్నదనీ అర్ధం వచ్చేలా ఆ టేపులో సంభాషణ ఉంది. టేప్ బయటకు రాగానే రాహుల్ గాంధీ దానిపై విచారణకు డిమాండ్ చేశారు.
తాజాగా సోమవారం నాడు రాహుల్ ఆ టేప్ గురించి ట్విట్టర్లో ప్రస్తావించారు. టేప్ బయటక వచ్చి నెల రోజులు గడుస్తున్నా, దానిపై దర్యాప్తునకు ఆదేశించలేదు, కాదంటే విశ్వజిత్ రాణెపై చర్యలూ లేవు అని రాహుల్ ట్వీట్ చేశారు. టేపుల్లో ఉన్న మాటలు వాస్తవాలు కాబట్టే పారికర్కు ప్రధానిపై అదుపు ఉందనీ రాహుల్ వ్యాఖ్యానించారు.
30 days since the Goa Audio Tapes on RAFALE were released. No FIR or enquiry ordered. No action against the Minister either!
It's obvious that the tapes are authentic & that Goa CM, Parrikar, is in possession of explosive RAFALE secrets, that give him power over the PM. https://t.co/sKwwfIj0bM
— Rahul Gandhi (@RahulGandhi) January 28, 2019
ఆ మరుసటి రోజే రాహుల్ పారికర్ పరామర్శకు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది. ఇది ప్రయివేటు సందర్శన. రఫేల్ డీల్ గురించి మాట్టాడలేదు అని కాంగ్రెస్ శాసనసభ్యుడు చంద్రకాంత్ కవ్లేకర్ తెలిపారు. తన తల్లి సోనియాగాంధీతోపాటు రాహుల్ ప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్నారు.
రఫేల్ ఒప్పందంలో ప్రధాని బారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అనిల్ అంబానీకి లాభం చేకూర్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారనీ, దానివల్ల 30 వేల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందనీ సుప్రీం కోర్టులో పిటిషన్దారులు ఆరోపించారు. అయితే ఒప్పందంపై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఒప్పందం కుదుర్చుకున్న క్రమాన్ని అనుమానించాల్సిన పని లేదని కోర్టు పేర్కొన్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?