Rahul: తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు డ్రగ్స్ ఇష్యూ తెరపైకి వచ్చి అట్టే కనుమరుగైపోతుంది. తాజాగా మరలా ఈ ఇష్యూ బయటకి వచ్చింది. తాజాగా మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లో అర్థరాత్రి వేళ జరిగిన పోలీసుల దాడిలో ఈ రచ్చ బయటపడింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు మరోమారు బయటకు పొక్కింది. అక్కడ రాహుల్ పట్టుబడటం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే ఇష్యూపై రాహుల్ సిప్లిగంజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Hyderabad Drugs Case: ఆ రాత్రి పబ్ లో ఏం జరిగింది..!? ఎవరెవరు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు..!? సెన్సేషనల్ రిమాండ్ రిపోర్ట్!
Rahul: ఆపరేషన్ రాడిసన్ బ్లూ హోటల్?
బంజారాహిల్స్ వద్ద గల రాడిసన్ బ్లూ హోటల్ పబ్పై అర్థరాత్రి వేళ టాస్క్ ఫోర్స్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడంతో సుమారు 150 మంది యువతీ యువకులు దొరికిపోయారు. ఇక ఈ దాడిలో పట్టుబడిన రాహుల్ సిప్లిగంజ్, నిహారిక విచారణ ఎదుర్కొన్న అనంతరం వారు తప్పేమీ లేకపోవడంతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కావాలంటే తనను పరీక్ష చేసుకోండని రాహుల్ సిప్లిగంజ్ అనడం అందరికీ తెలిసిందే.
Rahul Gandhi: ‘దేశానికి ఆయన ఆలోచనలు అవసరం’.. రాహుల్ గాంధీకి యావదాస్తి రాసి ఇచ్చిన డెహ్రాడూన్ వృద్ధురాలు
రాహుల్ తాజా పోస్ట్ ఇదే:
ఇక ఈ విషమై పరోక్షంగా రాహుల్ తన సోషల్ మీడియా ఖాతాలో తాజాగా ఓ పోస్ట్ పెడుతూ ఇలా స్పందించారు. ”నన్ను నమ్మి నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరని అర్ధం చేసుకున్నాను. అయినా కూడా నా మీద నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటో నాకు తెలుసు. ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు!” అంటూ కాస్త ఎమోషనల్ అవుతూ ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఇది చూసి కొందరు నెటిజన్స్ ఆయనపై పాజిటివ్గా రియాక్ట్ అవుతూ “ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేం నమ్ముతున్నాం బ్రో” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.