తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతగానో అలరిస్తూ ఉంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకోవడంతో, టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారు అన్నది చూస్తున్న ఆడియన్స్ లో రకరకాల అభిప్రాయాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో జబర్దస్త్ అవినాష్ ఎలిమినేట్ కావడంతో.. హౌస్ లో ఇంకా ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు.
ఇలాంటి తరుణంలో టాప్ ఫైవ్ లో కి వచ్చేవారం ఎవరు వెళ్తారు అన్నది చాలా సస్పెన్స్ గా ఉండటంతో ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లో చాలా హైలెట్ సన్నివేశాలు, టాస్క్ లు జరగటం గ్యారెంటీ అని ఆడియన్స్ బయట బాగా డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సీజన్ త్రీ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ రియాల్టీ షో పై ప్రేక్షకులు చూసే కోణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏమన్నారంటే బిగ్ బాస్ టైటిల్ ఒక టాస్క్ ఆడితే వస్తుందని ఆడియో భావించడం రాంగ్ అని చెప్పుకొచ్చారు. హౌస్ లోకి వెళ్ళాక పరిస్థితులను హ్యాండిల్ చేస్తూ సరిగ్గా ప్రవర్తిస్తూ.. సరైన భాష విధానంతో ప్రతీ పరిస్థితిని ఎదుర్కోవటం అనేది ముఖ్యమని ఒక ఆట ఆడితే సరిపోదని ఆ పరంగా ప్రేక్షకులు ఇంటిలో ఉన్న సభ్యుల తీరును గమనించాలని అంచనా వేయాలని రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు వచ్చిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.