రైల్వే లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అభ్యర్థులకు భారతీయ రైల్వే తీపి కబురు అందించింది.. చదువు పూర్తి కాగానే నిజమైన వృత్తి వాతావరణాన్ని తెలుసుకోవాలంటే అప్రెంటిస్ షిప్ చేయాలి.. వివిధ జిల్లాలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలను ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. పూర్తి వివరాలు ..
మొత్తం ఖాళీలు: 68
విభాగాలు:
సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
వయసు :
18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు వర్తిస్తుంది.
అర్హతలు:
సంబంధిత విభాగాలలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం:
అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
వేతనం :
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ కు రూ.14,000, డిప్లమో ఇంజినీర్స్ కు రూ.12,000 స్టైఫండ్ గా ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: 11/1/2021.