Railway News: దేశవ్యాప్తంగా కరోనా రక్కసి ప్రబలే వేళ దాన్ని అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రాలు వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సదరన్ రైల్వే వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అనగా సోమవారం నుంచి చెన్నైలో లోకల్ ట్రైన్ ఎక్కాలంటే తప్పని సరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకుని ఉండాల్సిందేనని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రం ట్రైన్ ప్రయాణం సాధ్యమవుతుందని సదరన్ రైల్వే చెప్పింది. అలాగే దానితో పాటు మాస్కులు ధరించడం కూడా అత్యవసరమని అన్నారు.
Railway News: కొవిడ్ నిబంధనలు పాటించకపోతే?
కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మాస్కు లేకుండా రైలు ప్రయాణం చేస్తే సుమారు రూ.500 వరకు జరిమానా ఉంటుందని సదరన్ రైల్వే శాఖ వారు హెచ్చరించారు. ఈ సోమవారం నుంచి ఈ కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయని సదరన్ రైల్వే ట్విటర్లో తాజాగా పేర్కొంది. చెన్నై సబ్అర్బన్ ప్రయాణికులకు ఇవి వర్తిస్తాయని అందులో పేర్కొన్నారు. కరోనాకు సంబంధించిన ప్రతి మార్గదర్శకాలను ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాలని సదరన్ రైల్వే చెప్పింది.
అక్కడ రైళ్లలో మిగతా నిబంధనల సంగతి చూడండి?
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండటంతో చెన్నై ప్రభుత్వం ఈ నెల 6 నుంచే రాష్ట్రంలో అనేక ఆంక్షలు విధించింది. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే సబ్అర్బన్ రైలు సర్వీసులను నడపాలని రాష్ట్ర ప్రభుత్వం వారు రైల్వే శాఖ వారికి ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు, రైల్వే కూడా కఠినమైన నిబంధనలను తాజాగా ప్రకటించింది. టిక్కెట్ కొనుగోలు చేసే ముందే ప్రయాణికులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలని అడగడం కొసమెరుపు.