ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు శుభవార్త అందించింది. దేశంలో అత్యధికంగా ప్రజలు ప్రయాణించేది ట్రైన్స్ లోనే. అయితే రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు టెక్నాలజీని రైల్వే సేవలకు అణుసంధానం చేస్తోంది ఐఆర్సీటీసి, రైల్వేశాఖ. ఇపుడు సరికొత్త టెక్నాలజీ తో రైలోఫీ అనే సంస్థ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.అదేంటంటే ఇక మీదట ట్రైన్ ఎక్కడ ఉంది.. ఏ టైం కి వస్తది..మనం దిగాల్సిన స్టాప్ ఎపుడు వస్తదనే టెన్షన్ లేకుండా, ఒకసారి పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయగానే, తమ మొబైల్స్ లోని వాట్సాప్ ద్వారా, అతి సులభంగా రియల్ టైమ్ పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీంతో ట్రైన్ జర్నీ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారనుంది.
అయితే ఒక్క పీఎన్ఆర్ స్టేటస్ మాత్రమే కాదు.. రైలు లైవ్ స్టేటస్, ఆలస్యానికి సంబంధించిన వివరాలు, రాబోయే స్టాప్లకు సంబంధించిన వివరాలతో పాటు మరిన్ని సేవలను వినియోగించుకోవచ్చు ప్రయాణికులు.ఇదంతా మన వాట్స్ అప్ నుండే తెల్సుకునే సౌలభ్యం ప్రయాణీకులకు చాలా ఉపయోగకరంగా మారనున్నది అని రైలోఫి సంస్థ తెల్పింది.
ఈ టెక్నాలజీ ద్వారా వాట్సాప్ పీఎన్ఆర్ స్టేటస్కు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇది ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ సదుపాయాన్ని పొందాలి అంటే కనుక వాట్సాప్ యూజర్లు రైలోఫీ యాప్ను అప్డేట్ చేసుకోవాలి. తర్వాత +91-9881193322 నెంబర్ ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్నాక వాట్సాప్లోకి వెళ్లి మీరు చూడాల్సిన పీఎన్ఆర్ నంబర్ను ఎంటర్ చేయాలి. వెంటనే అందుకు సంబంధించిన డీటైల్స్ వచ్చేస్తాయి. అంతేకాదు ఆ తరువాత మీ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా తెలుసుకోవచ్చు.తర్వాత మీకు మీ జర్నీకు సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు రియల్టైమ్లో వస్తూ ఉంటాయి.