Rain Alert: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మెస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
మంగళవారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసాయి, అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది, పిడుగులు పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు నష్టపోయారు. అత్యధిక మండలాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షం పడింది. భీమవరం, ఆచంట, ఆకివీడు, కాళ్ల, ఉండి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షం కురిసింది. ఆచంట మండలంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ధాన్యం కాశులు, బస్తాలు రోడ్లపైనే ఉన్నాయి. అవి తడిసి ముద్దయ్యాయి. ఆకివీడులో రెండున్నర గంటల పాటు ఏకబిగిన వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Breaking: పుష్ప – 2 టీమ్ కు రోడ్డు ప్రమాదం .. పలువురికి గాయాలు