మొన్నటి వరకూ వేసవి తాపంతో అల్లాడిన తెలుగు ప్రజలకు వర్షాలు పలుకరించనున్నాయి. వచ్చే 24గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్తే. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని.
. ఆపై వచ్చే నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో సాధారణ వర్షాలు.. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.