ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో సమావేశం అవ్వడం జరిగింది. ఇలా వరుసగా కేంద్ర మంత్రులతో బేటీ అవటంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన రఘురామకృష్ణంరాజు తనపై వైసీపీ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు మరియు సొంత జిల్లాలో ఉన్న పార్టీ నాయకులకు మరియు కార్యకర్తల చేత విమర్శలు చేయిస్తుందని తనకు ప్రాణహాని ఉందని లబోదిబోమంటు ఇక్కడ హడావిడి చేసిన రాజ్ నాథ్ సింగ్ దగ్గర ఇవేమీ ప్రస్తావించలేదని ఢిల్లీలో టాక్.
కేవలం తన ఎంపీ పదవి పోకుండా బీజేపీ పార్టీలోకి తనని తీసుకోవాలి అని రాజు గారు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఏమాత్రం వైసీపీ పార్టీలో తనకు ఉండటం ఇష్టం లేదని… ఎలాగైనా పార్టీ నుంచి తనను సస్పెండ్ అయ్యేలా చెయ్యాలని కోరినట్లు వార్తలు వినబడుతున్నాయి. కానీ ఈ విషయంలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం ఎటువంటి హామీ రాజు గారికి ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా కేంద్రం నుండి వస్తున్న నిధులతో రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలు వైయస్ జగన్ తనకు పొలిటికల్ మైలేజ్ వచ్చేలా వ్యవహరిస్తున్నారని… కేంద్రం పంపిస్తున్న నిధులు ఖర్చు చేసి… తన ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ దగ్గర ఈ న్యూస్… రఘురామకృష్ణంరాజు లీక్ చేసినట్లు సమాచారం. అదే విధంగా తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సరైన యాక్షన్ తీసుకోలేదని రాజ్ నాథ్ సింగ్ దృష్టికి రఘురామకృష్ణంరాజు తీసుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కేంద్ర పెద్దల దగ్గర పార్టీ నుండి సస్పెండ్ అయ్యేలా చేసి బీజేపీలోకి తనని తీసుకోవాలని రఘు రామకృష్ణంరాజు ఢిల్లీలో చక్కర్లు కొట్టినట్లు జాతీయస్థాయిలో వార్తలు వినపడుతున్నాయి.