ముంబాయి, ఫిబ్రవరి 17: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ గాయకులతో కలిసి పని చేయడం ఆపేయాలని రాజ్థాకరే పార్టీకి చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మ్యూజిక్ కంపెనీలను హెచ్చరించింది.
టి సిరీస్ తన యూట్యూబ్ ఛానల్ నుండి పాకిస్థాన్ గాయకుల పాటలను తొలగించింది.
పాకిస్తానీ గాయకులు ఫతే ఆలీఖాన్, అతిఫ్ అస్లాం పాటలను టి సిరీస్ తొలగించినట్లు సమాచారం.
‘టి సిరీస్, సోని మ్యూజిక్, వీనస్, టిప్స్ మ్యూజిక్ లాంటి భారతీయ మ్యూజిక్ కంపెనీలతో మాట్లాడాం, పాకిస్తాన్ గాయకులతో పని చేయడం ఆపేయమని కోరాం, వెంటనే వాళ్లతో కలిసి పని చేయడం ఆపకపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, మా అదేశాలు టీ సిరీస్ స్పందించింది’ అని ఎంఎన్ఎస్ సినీ విభాగం అధ్యక్షుడు అమీఖోప్కర్ తెలిపారు.
2016లో ఉరీ ఘటన తరువాత కూడా ఎంఎన్ఎస్ ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. 48గంటల్లో పాక్ నటులు దేశం విడిచి వెళ్లపోవాలని ఆదేశించింది.