“ఆర్ఆర్ఆర్” తరువాత రాజమౌళి చేసే ప్రాజెక్టు మహేష్ తో అని అందరికీ తెలుసు. లాక్ డౌన్ సమయంలోనే రాజమౌళి కన్ఫామ్ చేయడం జరిగింది. దీంతో మహేష్ బాబుని రాజమౌళి ఏ విధంగా చూపిస్తారు అన్నదానిపై రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. కొంతమంది జేమ్స్ బాండ్ తరహా లో అని అంటుండగా మరికొంతమంది కౌబాయ్ స్టైల్ లో అంటూ డిస్కషన్లు చేసుకుంటున్నారు.
ఇటువంటి తరుణంలో ఫిలిం వర్గాలలో తాజాగా వినపడుతున్న వార్త ఏమిటంటే మహేష్ కోసం రాజమౌళి సరికొత్త క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగిందని, చత్రపతి శివాజీ కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుందన్న టాక్ వస్తుంది. దీంతో సినిమాలో మహేష్ బాబు శివాజీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా అయిన వెంటనే రాజమౌళితో చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఎప్పటినుండో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా రావాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా.. లాక్ డౌన్ టైమ్ లో ఓకే అవటంతో.. “సర్కారు వారి పాట” సినిమా హిట్ అయితే బాగుంటుందని బలంగా కోరుకుంటున్నారు. కారణం ఎలాగో రాజమౌళి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది కాబట్టి మరో హ్యాట్రిక్ మహేష్ కొట్టే ఛాన్స్ ఉందని అభిమానుల అంచనాలు వేస్తున్నారు.