Rajamouli: భారతదేశ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తీసిన మగధీర సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అద్భుతాలు సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు అనే టాక్ ఈ సినిమాతో అప్పట్లో గట్టిగా వినబడింది. సౌత్ ఇండియా లో ఎవ్వరు తీయని రీతిలో మగధీర సినిమా ని రాజమౌళి తెరకెక్కించడం తో .. ఈ సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు సినిమా యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
గీతా మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా.. అనేక రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్ కి తిరుగులేని స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అటువంటి ఈ సినిమా కథ మొట్టమొదట రాజమౌళి రామ్ చరణ్ కి కాకుండా మరో హీరోకి చెప్పటం జరిగిందట. ఆ విషయం తాజాగా సోషల్ మీడియా బయటపడింది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా చరణ్ కి చెప్పకముందే చిరంజీవికి ఐదు సంవత్సరాల క్రితమే అప్పట్లో రాజమౌళి స్టోరీ వినిపించటం జరిగిందట.
Read More: RRR : ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ 2022లోనా..?
అయితే చిరంజీవి ఏ విషయము చెప్పకుండా దాదాపు ఐదు సంవత్సరాలపాటు స్టోరీని హోల్డ్ చేశారట. ఆ తర్వాత వెంటనే చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండో సినిమాగా దీన్ని తెరపైకి తెచ్చి .. చరణ్ కెరీర్లో మర్చిపోలేని హిట్ వచ్చేలా చిరంజీవి వెనకనుండి మగధీర కథ వేరే వారి చేతికి వెళ్లకుండా చూసుకోవటం జరిగిందట. ఏది ఏమైనా కొడుకు కెరీర్ విషయంలో చిరంజీవి చాలా ముందు చూపుతో అప్పట్లోనే మగధీర చరణ్ కి వచ్చేలా వ్యవహరించటం నిజంగా గ్రేట్ అని తాజా వార్త పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!