BREAKING: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్(ys jagan) ఇంటికి రాజమౌళి(Rajamouli), ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) వెళ్లనున్నారు. విషయంలోకి వెళితే రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి మాసంలో.. రిలీజ్ కానుంది. దాదాపు కొన్ని వందల కోట్లతోdvv నిర్మాణ సంస్థ నిర్మించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో.. తీసుకున్న నిర్ణయంతో.. నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతూ ఉండటంతో పైకి చెప్పకపోయినా చాలామంది విభేదిస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో RRR జనవరి మాసం లో రిలీజ్ అవుతున్న తరుణంలో సినిమా టికెట్ గురించి సీఎం జగన్ తో చర్చలు జరపడానికి దర్శకుడు రాజమౌళితో పాటు సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ రంగంలోకి దిగారు. ఇదే విషయాన్ని నిర్మాణసంస్థ dvv తెలియజేసింది. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల RRR సినిమాకి ఎంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని.. అయితే ఈ విషయంలో న్యాయస్థానాలకు వెళ్లకుండా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తో.. చర్చలు జరపడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ తో టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలసి రాజమౌళి భేటీ కావడం అటు రాజకీయ పరంగా ఇటు సినిమా పరంగా సంచలనంగా మారింది.