ఎస్ ఎస్ రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లు పోరాట యోధులుగా నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తోంది. బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తుంది. ఇక అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు కరోనా కారణంగా సినిమా చాలా సార్లు మొదలు పెట్టాలనుకొని ఆగిపోయాడు రాజమౌళి. దానికి తోడు లొకేషన్స్ కూడా కాస్త ఇబ్బంది పెట్టాయి. వర్షాకాలం కావడంతో సినిమాకి బాగా అంతరాయం కలిగింది.
కాగా ఎట్టకేలకి మళ్ళీ ఈ సినిమాని సెట్స్ మీదకి తెచ్చేందుకు రాజమౌళి సిద్దమయ్యాడు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ లాగే మరో హీరోయిన్ ఓలియా మోరెస్ హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. కాగా కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నీ బద్రతల మధ్య రాజమౌళి చిత్రీకరణ జరపనున్నాడని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో మొదట ఎన్.టి.ఆర్ మాత్రమే పాల్గొనబోతున్నాడు.
ఈ లోపు రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ అవ్వబోతున్నాడని సమాచారం. ఇక ఎన్.టి.ఆర్ తన షెడ్యూల్ ను పూర్తి చేసి ఆ వెంటనే త్రివిక్రమ్ తెరకెక్కించబోయో సినిమాలో జాయిన్ కానున్నాడట. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఎన్.టి.ఆర్ కొమరం భీం వీడియో టీజర్ నూతన సంవత్సరలోనే ఉండబోతుందని తెలుస్తుంది.