Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్టు తీరుపై ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని తెలియజేశారు.. ఢిల్లీ విమానాశ్రయానికి లుప్తానాసా విమానంలో ఉదయం 1 గంటకు చేరుకున్నాను అక్కడ ఆర్టిపిసిఆర్ దరఖాస్తు నింపడానికి ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు.. కొంతమంది నిలుచొని ఫాం ఫిల్ చేస్తుంటే.. మరికొంతమంది గోడ మీద పేపర్ పెట్టి ఫోన్ కట్ చేస్తున్నారు.. ఈ విషయాన్ని పై రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారు ఢిల్లీ విమానాశ్రయం వారు దరఖాస్తు నింపడానికి టేబుల్ లను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు..!!
అంతేకాకుండా ఎయిర్ పోర్టు బయట ఎగ్జిట్ గేటు వెలుపల చాలా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని తెలిపారు. విదేశీయులు ఎవరైనా భారతదేశాన్ని పర్యటించడానికి వస్తే వారికి సదుద్దేశాన్ని కలగజేయదని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులపై తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రాజమౌళి ట్వీట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది.. ఈ విషయాన్ని గ్రహించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే స్పందించారు.. డియర్ రాజమౌళి గారు మీ అమూల్యమైన ఫీడ్ బ్యాక్ కు ధన్యవాదాలు. ఆర్టిపీసిఆర్ ఫామ్స్ నింపడానికి బల్లలు ఏర్పాటు చేస్తాం. అలాగే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల నీటుగా ఉంచుతాము.. మీ ఫీడ్ బ్యాక్ వలన ఎయిర్పోర్ట్ లో ఇంప్రూమెంట్ చేస్తాము.. అని రీట్వీట్ చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు..
Dear Mr. Rajamouli, thank you for your valuable feedback and this provides us the opportunity for improvement. We have desks at the designated areas for RT-PCR-related purposes; however, increased number of desks and visibility at other locations will improve experience on (1/2)
— Delhi Airport (@DelhiAirport) July 2, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?