Rajamouli: దాదాపు రాజమౌళి సినిమాలు స్టోరీ లు మొత్తం విజయేంద్ర ప్రసాద్ రాస్తారు అన్న సంగతి తెలిసిందే. తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసే కథలతో కొడుకు రాజమౌళి అనేక అద్భుతాలు ఇప్పటివరకు సృష్టించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాజమౌళి గత ఏడాది లాక్ డౌన్ టైం లో చెప్పటం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి కూడా స్టోరీని విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ కి సంబంధించి విజయేంద్రప్రసాద్ చిన్న క్లూ ఇవ్వడం జరిగింది. విషయంలోకి వెళితే ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో.. సాగుతుందని మొన్నటివరకు వార్తలు వచ్చాయి.
Read more: Rajamouli: ఢిల్లీ ఎయిర్ పోర్టుపై రాజమౌళి అసంతృప్తి..!! ఢిల్లీ ఎయిర్ పోర్టు స్పందన ఏమిటంటే..!!
అయితే తాజాగా విజయేంద్రప్రసాద్ హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ ‘ఇండియానా జోన్స్’ సినిమా మాదిరిగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ తెలపడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే కౌబాయ్ తరహాలో.. జేమ్స్ బాండ్ ఫ్లవర్ మాదిరిగా.. రాజమౌళి మహేష్ సినిమా ఉంటుందని తాజా వార్త పై సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు భావిస్తున్నారు. ఎప్పటి నుండో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయాలని.. అభిమానులు మాత్రమే కాక సినిమా ప్రేమికులు కూడా కోరుకుంటున్నారు. అయితే చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కావటంతో… ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలోని కీలకంగా మారింది.