తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాజకీయ అరంగ్రేటం చేస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంత వరకు ఏమీ తేల్చలేదు. పార్టీ పేరు ప్రకటించి ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేయాలని అభిమానులు కోరుతున్నారు. గతంలో పెద్ద సంఖ్యలో అభిమానులు రజనీ ఇంటివద్ద కు చేరుకొని రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేశారు.
అయితే రజనీ మాత్రం ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. మౌనం దాలుస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా రజిని అభిమానులతో సమావేశం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. రేపు నవంబర్ 30 ఉదయం 9 గంటలకు అభిమాన సంఘ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు అభిమాన సంఘం నేతలకు చెన్నై రావాల్సిందిగా రజినీకాంత్ పిలుపిచ్చారు. ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నది. సమావేశానికి హాజరుకావాలని అభిమాన సంఘం నేతలకు పిలుపునిచ్చారు
కానీ ఈ సమావేశం ఎందుకు అనే విషయాన్ని రజిని వెల్లడించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేస్తారా? లేదా అన్నదానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రజిని ఈ సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ సమావేశంలోనే రజిని రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. చూడాలి రజిని మనసులో ఏముందో. ఏపీలో రాజకీయ పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రజని రాజకీయాలలోకి రాకుండా ఉంటే మంచిది అనే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వద్దంటూ కూడా హితవు పలికారు. అయితే రజినీకాంత్ చిరు సూచనలు పాటిస్తారా లేక ఆయన ముందుగా ప్రకటించిన విధంగా రాజకీయ పార్టీ పెట్టి రాబోయే ఎన్నికల్లో పోటీ పడతారా వేచి చూడాలి.