తమిళనాడు రాజకీయాలు గమనిస్తే చాలావరకు సినిమా రంగానికి చెందిన వాళ్లే ఏలిన వారు ఉన్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్లంతా సినిమా రంగాలలో ప్రేక్షకుల అభిమానం అందుకొని తర్వాత రాజకీయాలలో తిరుగులేని నేతలుగా ఎదిగారు. అయితే తాజాగా తమిళనాడు రాజకీయాలు గమనిస్తే కరుణానిధి మరియు జయలలిత మరణాలతో చాలా చప్ప చప్పగా తమిళ రాజకీయాలు సాగుతున్నాయి.
ఇటువంటి తరుణంలో కమలహాసన్, రజిని తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టడంతో మళ్లీ ఇప్పుడు తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన రజినీకాంత్ త్వరలోనే తన పార్టీ సిద్ధాంతాలను ఇంకా అనేక విషయాలను తెలియజేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెలపడం మనకందరికీ తెలిసిందే.
ఇప్పటికే జిల్లాల వారీగా అభిమానులతో రజిని భేటీ అవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా కొత్త పార్టీకి సంబంధించి సింబల్ అదేవిధంగా జండా, ఎజెండా లపై కూడా అభిమానుల దగ్గర నుండి సూచనలు తీసుకుంటున్నారు అనే టాక్ వస్తోంది. ఈ క్రమంలో తన కొత్త పార్టీ గుర్తుకు సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ ఐడియా ని ఫాలో అవటానికి రజిని రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తలైవా పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అంటూ తమిళ రాజకీయాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన పార్టీ ఎన్నికల చిహ్నంగా సైకిల్ ను రజనీ ఎంచుకోబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నేడు రజినీ పుట్టిన రోజు కావడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఎత్తున పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు.