Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది రాజకీయాల్లోకి వస్తాను అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చి అభిమానులతో వరుస భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీ పోటీ చేయటానికి రెడీ అయ్యి.. కొత్త పార్టీ పెట్టడానికి ఏర్పాటు చేసుకుని అభిమానుల దగ్గర సూచనలు కూడా రజిని తీసుకోవటం తెలిసిందే. దీంతో రజనీ కచ్చితంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం గ్యారెంటీ అని మరికొంతమంది ముఖ్యమంత్రి రజినీకాంత్ యే అంటూ కూడా అప్పట్లో విశ్లేషణలు చేశారు.
ఇదిలా ఉంటే సరిగ్గా పార్టీ ప్రకటించాలని అనుకుంటున్న కొద్ది రోజుల ముందు.. రజినీకాంత్ అనారోగ్యానికి గురి కావటం హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో.. ఒక్కసారిగా పరిస్థితులు మాత్రం మారిపోయాయి. వెంటనే రజిని తాను రాజకీయాల్లోకి వెళ్లడం అనేది భగవంతుడు ఇష్టంలేదని మూడు పేజీల లెటర్ అభిమానులకు రాసి తన నిర్ణయాన్ని తెలియజేశారు. దీంతో అప్పట్లో రజనీ అభిమానులు.. రజినీ రాజకీయాల్లోకి రాకుండా తీసుకున్న నిర్ణయాన్ని.. ఎంతగానో తప్పు పట్టి.. నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
Read More: Rajnikanth: టాప్ హీరో దర్శకత్వంలో..రజినీకాంత్ 170 వ సినిమా..??
ఆతర్వాత రజిని అస్వస్థతకు గురి కావటం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకుని ఇటీవల చెన్నై కి రావడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈరోజు మరోసారి అభిమానులతో మీటింగ్ నిర్వహించడానికి రజిని రెడీ అవ్వడం జరిగింది. అమెరికాకు వెళ్ళి పరీక్షలు చేయించుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు మరోసారి అభిమానులతో రజిని సమావేశం నిర్వహించడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మరియు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?