Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది చివరిలో పొలిటికల్ పార్టీ అంటూ తెగ హడావిడి చేయడం జరిగింది. సరిగ్గా డిసెంబర్ చివరి మాసం చివరిలో పార్టీకి సంబంధించి అన్ని విశేషాలు తెలియజేస్తాను సిద్ధాంతాలు ఏమిటో చెబుతాను అంటూ … సోషల్ మీడియాలో భారీ ఎత్తున రజినీకాంత్ పోస్టులు పెట్టి తమిళ రాజకీయాలను వేడెక్కించారు. గజినీ పోస్టులు చూసి తమిళ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కూడా భారీ స్థాయిలో తెగ హడావిడి చేశారు. కచ్చితంగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు లో రజిని ముఖ్యమంత్రి అవడం గ్యారెంటీ అని అనేక మంది విశ్లేషకులు కూడా విశ్లేషించేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా పార్టీ ప్రకటించే టైములో రజినీ అనారోగ్యానికి గురయి హైదరాబాదులో చికిత్స తీసుకోవటం మాత్రమే కాక కొద్దిగా సీరియస్ కండిషన్ కావటంతో… రజనీ వెంటనే పొలిటికల్ వైపు వేస్తున్న అడుగులు వెనక్కి వేయడం జరిగింది. రాజకీయాల్లోకి రావడం లేదని మూడు పేజీల లెటర్ అభిమానులకు తెలియజేసి.. భగవంతుడికి ఇష్టం లేదని అందుకే తాను రావడం లేదని రజిని వివరణ ఇవ్వడం జరిగింది. దీంతో రజిని రాజకీయ అడుగులు వెనక్కి పడటంతో ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం చెందారు. అంత మాత్రమే కాక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు కూడా చేపట్టారు. అయితే ఈ క్రమంలో కొంతమంది రజనీ ఆరోగ్యం కంటే… రాజకీయాలు పెద్దవి కాదని ఆయన ఆరోగ్య మే ముఖ్యమని… చెప్పటంతో చాలా వరకు రజనీ అభిమానులు శాంతించారు.
Rajinikanth రజినీకాంత్ గతంలో
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా రజినీకాంత్ గతంలో పెట్ట అనే సినిమా తీసిన డైరెక్టర్ తో రెండోసారి ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నట్లు తమిళ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో యాక్షన్ డ్రామాగా 2019 వ సంవత్సరం లో రిలీజ్ అయిన పేట భారీ స్థాయిలో విజయం సాధించింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇటువంటి తరుణంలో మరోసారి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదల కాబోతున్న ట్లు… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తమిళ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.