Rajinikanth: సమాజంలో ఎంతో మంది భార్య, భర్తలు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ప్రధానంగా దంపతుల్లో సర్దుకుపోయే మనస్థత్వం లేకపోవడం కారణంగానే వివాహ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. సామాన్య కుటుంబాల్లో జరిగే విడాకులను అంతగా ఎవరూ పట్టించుకోరు. కానీ సెలబ్రిటీల విషయానికి వస్తే వారి కుటుంబాలలో జరిగే ఏ వేడుక అయినా, ఇతర విషయాలపైనా మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ధనుష్ – ఐశ్వర్యల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య కూడా గతంలో విడాకుల తీసుకున్న విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
Rajinikanth: దర్శకత్వంలో రాణిస్తున్నారు కానీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మారినప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రజనీ సినీ జీవితం చాలా సాఫీగా సాగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రజనీకాంత్ ఇంత కాలం సంతోషంగానే ఉన్నారు. కానీ రజనీ కుమార్తెలు మాత్రం వారి వివాహ బంధాలను నిలబెట్టుకోలేకపోతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. రజనీకాంత్ కు ఇద్దరు కుమార్తెలు.. ఐశ్వర్య, సౌందర్య.. వీరు ఇద్దరు సినీ పరిశ్రమలో డైరెక్టర్ లుగా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వృత్తిపరంగా వీరు ఇద్దరు హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండానే ముందుకు వెళుతున్నారు. కానీ వీరి వైవాహిక జీవితాలే సాఫీగా సాగలేదు.
చెల్లి బాటలో అక్క
ఇంతకు ముందు రజనీ చిన్న కుమార్తె సౌందర్య వ్యాపారవేత్త అశ్విన్ రాజ్ కుమార్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు పుట్టిన ఏడాది తరువాత వారిద్దరికి మనస్పర్ధలు వచ్చాయి. విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రెండేళ్లకు నటుడు విషగన్ వనంగముడిని సౌందర్య వివాహం చేసుకుంది. చెల్లి బాటలోనే అక్క అన్నట్లు ఇప్పుడు రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఏకంగా పెళ్లైన 18 ఏళ్ల తరువాత వివాహా బంధాన్ని తెంచేసుకుంటోంది. ఐశ్వర్యే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. పలు కారణాలతో విడాకులు తీసుకోబోతున్నట్లు ధనుష్, ఐశ్వర్య లు వారి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!