రజనీకాంత్ ఈ పేరు తెలియని భారతీయుడు అంటూ ఎవరు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదు. సాధారణ బస్సు కండెక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఎంతో కష్టం మీద వెండితెరకు పరిచయమై కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు రజనికాంత్. సినీరంగ ప్రవేశం ఆరంభం లో చిన్న చిన్న క్యారెక్టర్ లు వేసిన ఆ రజనీనే ఇప్పుడు భారత దేశానికే సూపర్ స్టార్ గా మారారు. మరి అంత క్రేజ్ ఉన్న తలైవాను ప్రత్యక్ష రాజకీయాల్లోకీ రమ్మని అయన అభిమానులు చాలా సార్లు కోరారు.
కానీ ఎప్పుడు ఆ అంశానికి సంబంధించి నోరు విప్పలేదు రజనీకాంత్. కానీ ఇటీవల బహిరంగంగా పార్టీ ని స్థాపించబోతున్నానంటూ ప్రకటించేసారు. కానీ ఆదిలోనే హంసపాదు పడినట్లు ఆ ప్రకటన ప్రకటనకే పరిమితమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మొన్ననే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల పాటు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత కోలుకున్న రజని సరాసరి తమిళనాడు లోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పుడు సుదీర్ఘంగా ఆలోచించిన రజని ఓ కీలక ప్రకటన చేసారు.
ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్యం దృష్ట్యా , కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు రజని లేఖ ద్వారా అభిమానులకు తెలిపారు. దీనితో ఈ వార్త తమిళనాట పెనుసంచలనంగా నిలిచింది. దీనితో మూవీ మేకర్స్ తెగ సంబరపడుతున్నారట. రజని రాజకీయ ఎంట్రీ దాదాపు లేదని తేలిపోవడం తో రజని కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నార్నని ఇండస్ట్రీ టాక్. రజని లాంటి సూపర్ స్టార్ తో సినిమా తీయాలని కళలు కన్నా వారంతా ఫుల్ ఖుషీలో ఉన్నారట. రజని ఇకపై వరుసగా సినిమాలు చేసేస్తారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇకపై రజనీకాంత్ కెరీర్ మొత్తం సినిమాలకే అంకితం చేయాలని భావిస్తున్నారట.ప్రస్తుతం రజనీకాంత్ అన్నాతే అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.