మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు ఆమె తరపు న్యాయవాది పుగళేంధి మీడియాకు వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో భాగంగా ఆమె 28ఏళ్ల నుండి శిక్షను అనుభవిస్తోంది.
ఈ కేసులో ఆమె భర్తతో సహా ఏడుగురు శిక్షను అనుభవిస్తున్నారు. నళిని కూతురు పెళ్లి కారణంగా ఆరు నెలలుగా బయటే ఉంది. అయితే జైల్లో ఉన్నప్పుడు తన తోటి ఖైదీని పనుల పేరుతో హింసిస్తోందని తోటి ఖైదీ జైలర్ కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పదే పదే తనను ప్రశ్నిస్తుండడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఉంటోన్న వెల్లూరు జైలు నుండి పుళల్ జైలుకు తరలించాలని కోరనున్నట్లు ఆమె న్యాయవాది తెలిపారు.