వారణాసి, జనవరి 22: అవినీతిని రూపుమాపడానికి కాంగ్రెస్ చేసింది ఏమీలేదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 1985లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యను ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రస్థావించారు. సమాజంలో సంక్షేమానికి వినియోగిస్తున్న నిధుల్లో 15శాతం కూడా లబ్దిదారులకు చేరడం లేదని అప్పట్లో రాజీవ్ గాంధీ అన్నారు. మంగళవారం ఇక్కడ ప్రవాస్ భారతీయ దివస్ను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే మోదీ ఈ వ్యాఖ్య చేశారు. ఒక ప్రధాన మంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రస్తుత సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొని అటువంటి అవినీతిని నిరోధిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
previous post
next post