ఇండియా – చైనా సరిహద్దు సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లోక్ సభలో ఈ విషయంపై ఆయన ప్రసంగిస్తూ చైనా 90 వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని 1962లో లఢక్ లో ఆక్రమించిందని ఆయన తెలియజేసారు.
సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవట్లేదని రాజనాథ్ సింగ్ వెల్లడించారు. చైనాతో స్నేహపూర్వక సంబంధాన్ని తాము కోరుకుంటున్నామని, అయితే చైనా దూకుడు వ్యవహారంతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం పడిందని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎల్ఏసీ అంశంలో రెండుదేశాల మధ్య వివాదాలు ఉన్నాయని, సరిహద్దు సమస్య తేలేవరకూ ఎల్ఏసీని గౌరవించాలన్న నిబంధనను చైనా ఉల్లంఘిస్తోందని రాజనాథ్ సింగ్ ఆరోపించారు. సరిహద్దులను మార్చాలన్న చైనా ప్రయత్నాలను మన సైన్యం తిప్పి కొట్టిందని ఆయన తెలిపారు. సార్వభౌమత్వం విషయంలో రాజీపడబోమని, ఇదే విషయాన్ని చైనాకు స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.