రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు పరిశ్రమకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు అనే చెప్పాలి. అమ్మడు సినిమాలో నటించిన దానికంటే గాసిప్ ల ద్వారా నే మంచి గుర్తింపు సంపాదించిందని టాక్. అగ్రతారల సరసన హీరోయిన్ గా ఛాన్సులు పొందినా ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ దక్కలేదని చెప్పాలి . వరుస ఫ్లాప్ లను పొంది ఇండస్ట్రీలో కాస్త వెనుకపడింది అని చెప్పాలి. స్టార్ హీరోయిన్ మేటర్ ఉన్నా అమ్మడు కు లక్ ఆమడ దూరం ఉందని ఇండస్ట్రీలో టాక్. కెరీర్ మ్యాటర్ పక్కనపెడితే రకుల్ పై వచ్చినన్ని పుకార్లు , వార్తలు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి రాలేదు అనే చెప్పాలి.ఆ మధ్యన సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ అంశంలో.. రకుల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తో ప్రేమాయణం నడుపుతోందన్న వార్తలు వినిపించాయి.
ఇది చాలదన్నట్లు టాలీవుడ్ దర్శకుడు తో ఎఫైర్ నడుపుతున్నట్లు పుకార్లు షికార్లు కొట్టాయి. ఆమెకు ఓ వ్యక్తి ఇల్లు కొనిచ్చాడు అన్న వార్తలు కూడా మీడియా లో చక్కర్లు కొట్టాయి.అయితే తనపై ఎన్ని పుకార్లు వచినా ఏనాడు స్పందించని ఆమె ఓ షో లో చేసిన స్టేట్ట్మెంట్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇప్పటివరకు తన పై గాసిప్స్ కురిపించిన వారిని లైట్ గా తీసుకోవాలంటూ కూల్ గా సమాధానం ఇస్తోంది. తెలివిగా పంచ్ డైలాగులతో వారి టైర్ పంచర్ చేసింది. ఆహా వేదికగా ప్రసారమవుతున్న సామ్ జామ్ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ గా హాజరైంది రకుల్. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంతా కొన్ని ప్రశ్నలను సంధించింది. దానికి రకుల్ చాలా కూల్ గా సమాధానం చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో నీ పై చాలావరకు రూమర్స్ వచ్చాయి మరి దానిపై నీవు ఎప్పుడు ఎందుకు స్పందిం చవు అని సమంత అడిగిన ప్రశ్నకు… రకుల్ ఇలా చెప్పుకొచ్చింది.ఒకటికి రెండు సార్లు ఆలోచించని వారే ఇలా చేస్తారని ,అలాంటి వారిని నేను పట్టించుకోను అంది ఈ అమ్మడు.నువ్వు ఉంటున్న ఫ్లాట్ ను ఎవరో గిఫ్ట్ ఇచ్చారని పుకార్లు వచ్చాయి ఇందులో నిజమెంత అన్నదానికి, ఇచ్చేవారు ఉంటే నేను ఎందుకు పని చేస్తాను ఎప్పుడో సినిమాలు మానేసేదన్ని కదా అంటూ ఎదురు ప్రశ్నించింది రకుల్. అలా ఉండి ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో క్లియర్ కట్ గా గాసిప్స్ ను రకుల్ అసలు పట్టించుకోదు అని అర్థమవుతుంది.పుకార్లు చేసేవారిని అస్సలు పట్టించుకోకూడదు అని మన పనీ వారికి సమాధానం చెబుతుందని అని చెప్పుకొచ్చింది రకుల్.