టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య 2020 ప్రారంభంలోనే అశ్వద్దామ అన్న యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీగా అంచనాలు ఉన్న ఈ ఈ సినిమా శౌర్య అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో నాగ శౌర్య కి క్లాస్ సినిమాలు.. సున్నితమైన ప్రేమ కథలు తప యాక్షన్ డ్రామాలు సెట్ కావన్న కామెంట్స్ వచ్చాయి. అయినా నాగ శౌర్య తగ్గడం లేదు. మళ్ళీ అదే తరహా కథల తో వరసగా సినిమాలు ఒప్పుకున్నాడు.
కాగా నాగ శౌర్య ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలకి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా ఇచ్చారు దర్శక, నిర్మాతలు. లేడీ డైరెక్టర్ సౌజన్య టాలీవుడ్ కి దర్శకురాలిగా పరిచయం అవుతూ ‘వరుడు కావాలెను’ అన్న సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తునారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు లక్ష్య అన్న సినిమా కూడా చేస్తున్నాడు నాగశౌర్య. ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కేతిక శర్మ హీరోయిన్ కాగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలతో పాటు యంగ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న మరో సినిమాలో నాగ శౌర్య నటించబోతుండగా ఈ సినిమాకి ‘శ్రీకృష్ణ సత్యభామ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ లలో వరసగా సినిమాలు చేతూ మంచి క్రేజ్ తో ఉంది. అందుకే ఈ సినిమాలో నాగశౌర్య కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారట. మొత్తానికి రకుల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.