Rakul Preet Singh : టాలీవుడ్ బడా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు తన దృష్టినంతా బాలీవుడ్ పైన కేంద్రీకరిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న అమ్మడు ఇక్కడ కాస్త నెమ్మదించడంతో హిందీ సినిమాలపై దృష్టిని పెట్టింది. ఈ క్రమంలోనే `ఎటాక్`, `రన్ వే`, `డాక్టర్ జీ`, `థాంక్ గాడ్`, `మిషన్ సిండ్రెల్లా`, `ఛత్రివాలి` వంటి సినిమాలను పూర్తి చేసింది. ఇదే ఏడాది ఈ చిత్రాలన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ చిత్రాలపై రకుల్ గట్టి ఆశలే పెట్టుకుంది.
Rakul Preet Singh : రకుల్ మకాం హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసిందా?
అవుననే చెబుతున్నాయి సినీ వర్గాలు. రకుల్ హైదరాబాద్ నుంచి ముంబైకి దుకాణం సర్దేసింది. బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకోవడం వెనుక తన మేనేజర్ కీలక పాత్ర పోషించారని ఓ మీడియా వేదికగా రకుల్ రివీల్ చేసింది. తన ప్రయత్నానికి తోడుగా వ్యక్తిగత మేనేజర్ సహకారం మరువలేనిదని తెలిపింది. ఇలా బాలీవుడ్ ప్రయత్నాలు మొదలైన దగ్గర నుంచి రకుల్ లో చాలా మార్పులు గమనించవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివిటీ మరింత పెంచింది. ఇన్ స్టాలో తన బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇస్తోంది.
రకుల్ స్పీడుని చూసి బాలీవుడ్ తారలు వణుకుతున్నారా?
రకుల్ స్పీడుని చూసి బాలీవుడ్ తారలు కాస్త అసహనానికి గురి అయినట్టుగా సమాచారం. ఎందుకంటే, ఇపుడు బిటౌన్ సినిమాలు కాస్త నెమ్మదించాయి. సౌత్ సినిమాలకు బాగా క్రేజ్ పెరిగింది. దాంతో అక్కడ సినిమాలు తక్కువగా నిర్మితమౌతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటీమణులు ఖాళీ పడ్డారు. ఇలాంటి తరుణంలో రకుల్ అర డజనుకు పైగా సినిమాలు అక్కడ చేసేస్తోంది. ఈ విషయం తెలిసిన అక్కడి సో కాల్డ్ నటీమణులు అభద్రతాభావానికి లోనైనట్టు సమాచారం.