Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే ఈ అందాల తార కన్నేసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో కలిసి మరో సినిమాలో మళ్లీ రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. వీరిరువురు మేరి పత్నీ కా మూవీ రీమేక్లో కలిసి నటించనున్నారు. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ ఈ సినిమాలో మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే రకుల్ గతేడాదిలోనే అర్జున్ కపూర్తో కలిసి నటించింది. మళ్లీ ఇప్పుడు అతడితోనే నటిస్తానని చెప్పి సర్ప్రైజ్ చేసిందీ ముద్దుగుమ్మ. ఊహించని విధంగా ఈ సినిమాలో ఈ క్యూట్ యాక్ట్రెస్ చేరడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ముద్దుగుమ్మ అర్జున్తో జత కట్టడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.
Rakul Preet Singh: అర్జున్తో మరో సినిమా చేయడానికి కారణమదే?
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
2021లో అర్జున్తో కలిసి సర్దార్ కా గ్రాండ్ సన్ మూవీ చేసింది రకుల్. సర్దార్ కా గ్రాండ్ సన్లో అర్జున్కి లవర్గా రకుల్ కనిపించింది. ఇప్పుడు మేరి పత్నీ కా మూవీ రీమేక్లో ఎంట్రీతో ట్విస్ట్ ఇచ్చింది. ఇదొక క్రేజీ కామెడీ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమాలో ఆమె నటించడానికి ఒకటే కారణం. అదేంటంటే దీనిని తన మామయ్య వాసు భగ్నాని నిర్మించడమే. ఈ హీరోయిన్ జాకీ భగ్నానీతో ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జాకీ తండ్రి వాసు ఈ రీమేక్ మూవీ నిర్మాణ బాధ్యతలు చేపట్టడంతో అతని కోడలైన రకుల్ కూడా ఇందులో జాయిన్ అయిపోయింది. దీంతో తన మామయ్య నిర్మిస్తున్న సినిమాల్లో నటించడానికి రకుల్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
మూవీ విశేషాలివే
పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ మూవీతో అర్జున్ బ్యాక్ టు బ్యాక్ రకుల్ ప్రీత్తోనే రెండు సినిమాలు చేసినట్టు అవుతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!