పరెషానురా.. పరెషానురా.. ప్రేమన్నది పరెషానురా అంటు తన హావ భావాలతో యువత హృదయాలను కొళ్లకొట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రతీ సినిమాలో హీరోతో మంచి కెమిస్ట్రీ పండించి అందరిని తనవైపు తిప్పుకుంటుంది ఈ చిన్నది. యారియాన్ అనే హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు మంచి అవకాశం లభించింది.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాశం కోసం ఎంతో మంది యాక్టర్లు ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలో ఏదో ఓ పాత్ర ఇస్తే చాలు అనుకునే వారు చాలా ఎక్కువ మందే ఉంటారు. అంతే కాకుండా ఆయనను ఒకసారి కలిస్తే చాలు అనుకునే వారు కూడా ఎక్కువే. దానికి కారణం మనకు తెలిసిందే. అంత పెద్ద స్టార్ కావడమే. తన నటనతో జనాలకు ఎంతో వినోదాన్ని ఇచ్చే నటుడు అమితాబ్ బచ్చన్.
అయితే ఇలాంటి గ్రేట్ యాక్టర్ తో నటించే అవకాశం ఇప్పుడు రకుల్ ప్రీత్ కు వచ్చింది. కెరటం సినిమాతో తెలుగులో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత ఎక్కడా వెనకడుగు వేయకుండా వరుస విజయాలు సాధించింది. ఇక ఈ మధ్య ఈ చిన్నది నటించిన సినిమాలు తుస్సు మనడంతో సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఈ మధ్య బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ ను ఆఫీసర్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇవేవీ పట్టించుకోని నిర్మాతలు ఈ అమ్మడికి సూపర్ ఛాన్స్ ఇచ్చారు.
ఇక విషయంలోకి పోతే.. అమితాబ్ బచ్చన్ మెయిన్ పాత్రలో నటించనున్న “మేడే” సినిమాకు అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో అమితాబ్, అజయ్ లు నటించనున్నారు. చాలా ఏళ్ల తరువాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. అయితే ఈ సినిమాలో ఒక మంచి రోల్ లో రకుల్ ప్రీత్ నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ పైలట్ గా నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
ఇది నిజమేనని రకుల్ కూడా తెలిపింది. దీనిపై ఆమె మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్తో కలిసి సినిమా చేయాలన్నది అందరి యాక్టర్లలాగే తన కల కూడా అని తెలిపింది. అది మేడే సినిమాతో ఆ కలను నిజం అవుతోందని తెలిపింది. ఈ చిత్రం వచ్చే నెలలో హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభం చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. రకుల్ ఈ సినిమాతో పాటు తెలుగులో నితిన్ ఒక సినిమా చేస్తోంది. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2లో కూడా నటిస్తోంది.