Rakul preeth singh : రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో కెరీర్ డిసైడ్ చేసేది ఆ సినిమా ఒక్కటే అన్న మాట ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఆ సినిమానే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ హీరోగా రికార్డ్స్ బ్రేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడితే రిలీజ్ చేస్తారు. మరి ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో క్రేజ్ తీసుకు వస్తుందా..రిజల్ట్ తేడా కొడితే పరిస్థితేంటి.. అన్నదే హాట్ టాపిక్ గా మారింది.
రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. భారీ సక్సస్లు అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి కూడా డేట్స్ సర్దుబాటు చేయలేనంత బిజీ హీరోయిన్గా ఇటు టాలీవుడ్లో.. అటు కోలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో పేరు తెచ్చుకున్న రకుల్ ఆ తర్వాత వరసగా మెగా హీరోలతో పాటు టాలీవుడ్ యంగ్ అండ్ సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. చెప్పాలంటే రకుల్ ఆ సమయంలో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంది.
Rakul preeth singh : రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మాత్రం క్రేజీ హీరోయిన్.
కాగా పూజా హెగ్డే, కీర్తిసురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ వచ్చి క్రేజీ స్టార్స్గా మారడంతో రకుల్ క్రేజ్ తగ్గిపోయింది. అదే సమయంలో రకుల్ నటించిన సినిమాలు కూడా హిట్ కాక పోవడం పెద్ద మైనస్ అయింది. ఇక సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమా చేయడం.. ఆ సినిమా డిజాస్టర్ కావడం రకుల్ కెరీర్ మీద ఇంకా ఎఫెక్ట్ పడింది. కానీ అనుకోకుండా నితిన్ తో చెక్ సినిమా, క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమాలలో అవకాశాలు వచ్చాయి. దాంతో రకుల్ మళ్ళీ టాలీవుడ్ లో తన సత్తా చాటుతుందనుకున్నారు. అయితే చెక్ సినిమా ఫ్లాపయి చెక్ పెట్టేసింది. ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమా మీదే. ఇక బాలీవుడ్ లో మాత్రం రకుల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్. అక్కడ వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది.