దోమకొండ, మార్చి 5 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం దోమకొండ కోటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.
రామ్ చరణ్ స్వయంగా శివలింగాన్ని కడిగి పూజలు నిర్వహించారు. చరణ్ సతీమణి ఉపాసన ఈ వీడియోను ట్వీట్ చేశారు.
కాకతీయుల కాలంలో 800 ఏళ్ల క్రితం ఈ శివాలయం నిర్మించారు. 400 సంవత్సరాల క్రితం దోమకొండ కోటను తమ పూర్వీకులు కట్టించారని చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
సాంప్రదాయ వస్త్రధారణలో చరణ్ శివలింగానికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. చరణ్ శివాలయం లో ఉన్న వీడియోను, శివరాత్రి సందర్భంగా విద్యుత్ తెలుగు లో ఉన్న శివాలయాన్ని ఉపాసన ట్వీట్ చేశారు.
దోమకొండ సంస్థానం తెలంగాణ లోని ప్రాచీన సంస్థానాల్లో ప్రముఖమైనది. ఈ సంస్థానానికి బిక్కవోలు సంస్థానం అని కూడా పేరుంది.
Shraddha, Bhakti & complete LOVE & devotion to Lord Shiva. ?? OM NAMAH SHIVAYA #ramcharan at the #Domakonda Shivalayam ?? restore ancient temples pic.twitter.com/sme3oPMo7P
— Upasana Konidela (@upasanakonidela) March 4, 2019