Ram Charan : మన తెలుగు సినిమా హీరోలు సినిమాల్లో నటించడంతో పాటు వ్యాపారాల్లోనూ చేతులు పెడతారు. అక్కినేని నాగార్జున, నాని, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఇలా లిస్టు పెద్దదే. ఎవరికి ఇంటరెస్ట్ వున్న రంగంలో వారు పెట్టుబడులు పెడుతూ వుంటారు. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న చెర్రి.. పలు వ్యాపార సంస్థలో కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. అందులో ఓ విమానాయాన సంస్థ కూడా ఉంది. దేని పేరే ట్రూజెట్ డొమాస్టిక్ ఎయిర్లైన్ బిజినెస్.
Ram Charan : ట్రూజెట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే?
ట్రూజెట్ సంస్థ 2015లో రామ్ చరణ్ తన స్నేహితుడితో కలిసి స్టార్ట్ చేశాడు. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో తన స్నేహితుడు ఉమేశ్తో కలిసి టర్బో మేఘా ఎయిర్వేస్ సంస్థను రామ్ చరణ్ స్టార్ట్ చేసారు.జులై 12వ తేదీ 2015లో స్టార్ అయిన సర్వీసులు ఇప్పటివరకు నిరాటకంగా నడుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ సంస్థ నష్టాల్లో నడుస్తుండటంతో దీనిపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
ఏమిటా పుకార్లు?
నష్టాల్లో ఉండటం వలన ఈ కంపెనీని మూసేస్తున్నారనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఉద్యోగులకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ నడుస్తుందనేది ఓ రూమర్. అయితే తాజాగా ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనని విడుదల చేసింది. దాని సారాంశం ఇదే.. “ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనే వార్తల్లో నిజం లేదు. ఇలాంటి వార్తలని నమ్మకండి.” అన్ని చెప్పుకొస్తూనే వివిధ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కారణాల వల్ల ట్రూజెట్ విమానయాన కార్యకలాపాలకు తాత్కాలిక నిలిపివేశాం.. అని చెప్పడం ఇక్కడ కొసమెరుపు.