Ram Charan: సోనుసూద్ ను చూసేందుకు ఒక అభిమాని ఏకంగా 700 కిలోమీటర్లు నడిచి తన అభిమాన హీరో సంగతి తెలిసిందే.. అలాగే ఒక అభిమాని రష్మిక ను చూసేందుకు 900 కిలోమీటర్లు ప్రయాణించిన సంగతి విన్నాం.. తాజాగా ముగ్గురు అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చూసేందుకు 231 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి.. 4 రోజుల తరువాత హైదరాబాద్ చేరుకుని రామ్ చరణ్ ను కలిశారు..!! వీరి గురించి తెలుసుకున్న రామ్ చరణ్ ఆశ్చర్యానికి గురయ్యారు.. వారిని కలిసి కాసేపు ముచ్చటించి, ఫోటోలకు ఫోజులు ఇచ్చారు..!! ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!
రవి, వీరేష్, రాజ్ ముగ్గురు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి 231 కిలోమీటర్లు నాలుగు రోజుల పాటు నడిచి వారి అభిమాన హీరో రామ్ చరణ్ ను కలుసుకున్నారు.. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వారిని ఆలింగనం చేసుకొని వారితో కాసేపు సరదాగా మాట్లాడారు.. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. తన అభిమానులు తనపై చూపిన నా ప్రేమకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్నారు. అలాగే ఆచార్య సినిమాలో సిద్ధ పాత్ర లో సందడి చేయనున్నారు. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!