Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్.. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత చరణ్ బ్రేక్ లేకుండా, వరుసగా సినిమాలు చేయాలని డిసైడయ్యాడు. ఇక ఇప్పటికే శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఆర్సీ 15గా రూపొందుతున్న ఈ సినిమాను విడుదల చేయనున్నా రు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అలాగే శంకర్ సినిమా చేస్తూనే మరో సినిమాను ప్రకటించాడు చరణ్. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పటికే ఈ మూవీనీ అధికారికంగా ప్రకటించారు. వంశీ – ప్రమోద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి ఒక మంచి సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. అయితే, రామ్ చరణ్ సరసన జోడీగా ఆర్సీ 16 సినిమాలో ముందు బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్గా అనుకున్నారు. దిశా పటానీ, ఆలియా భట్ లాంటి వారి పేర్లు సోషల్ మీడియాలో వచ్చాయి.
Ram charan: చరణ్ కూడా రష్మికకు ఛాన్స్ ఇస్తే ఇక మెగా హీరోయిన్స్ లిస్ట్లో చేరినట్టే.
కానీ, ఇప్పుడు రామ్ చరణ్ సరసన సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాను ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకుంది రష్మిక. అంతేకాదు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అన్నీ సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు పూజా హెగ్డే కంటే ఎక్కువ సినిమాలను బాలీవుడ్లో చేస్తోంది రష్మిక మందన్న. అందుకే, రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం హీరోయిన్గా రష్మికను ఫైనల్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. చరణ్ కూడా రష్మికను తీసుకునే విషయంలో పాజిటివ్గా ఉన్నారట. చరణ్ కూడా రష్మికకు ఛాన్స్ ఇస్తే ఇక మెగా హీరోయిన్స్ లిస్ట్లో చేరినట్టే.