కరోనా దెబ్బ కి నిర్మాతలు ఏం చేయాలో తోచని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది నిర్మాతలు చేతులు కాలే దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదలు పెట్టిన సినిమాలను ఎలా పూర్తి చేయాలో తెలియని అయోమయం…రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలను ఏం చేయాలన్న గందరగోళం. దాంతో నిర్మాతలు ఇప్పుడు కొత్త దారి పడుతున్నారు. అదే ఓటీటీ. ఈ ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా నిర్మాణం వ్యయం గిట్టుబాటు అయితే కళ్ళు మూసుకొని కొన్ని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని సినిమాలు అమోజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుండగా అల్లు అరవింద్ మొదలు పెట్టిన ఆహా ద్వారా కొన్ని సినిమాలు ప్రేక్షకులు చూసేందుకు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన కొన్ని సినిమాలను తన ఆహా ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే ఆహా ద్వారా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఇప్పటికే కథలని సిద్దం చేయించే పనిలో ఉన్నారు. వాటితో పాటు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తో ఒక సెలబ్రిటీ టాక్ షో ని ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఓటీటీ ప్లాట్ ఫాం ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ కేవలం తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసమే ప్రారంభించినట్టు ఈ సంస్థలో ఆయనతోనే సినిమా నిర్మాణాలు జరుపుతానని చరణ్ గతంలో వెల్లడించారు. ఈ రకంగా రాం చరణ్ అల్లు అరవింద్ కి నిర్మాతగా పోటీ వచ్చాడని చెప్పుకున్నారు. అలాగే మరోసారి ఆహా కి పోటీగా చరణ్ ఓటీటీ ని ప్రారంభించి ఈ విషయంలో కూడా పోటీ ఇవ్వబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి చరణ్ నిజంగా ఓటీటీ ని మొదలు పెడతాడా లేదా అన్నది ఇంకా అధికారకంగా వెల్లడి కాలేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!