Ram charan : రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా ఆశపడుతుంటారు. కాని అందరికి ఆ ఆశ నేరవేరాలంటే అంత సులభంగా అయ్యే పని కాదు. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఆలియా భట్ జంటగా నటిస్తోంది. భారీ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఈ సినిమాకి దర్శక ధీరుడి రాజమౌళి రూపకర్త కాబట్టి ఆలియా కి ఈ అవకాశం దక్కింది. ఇక టాలీవుడ్ లో రష్మిక మందన్న..సాయి పల్లవి, నివేదా థామస్..కీర్తి సురేష్ లాంటి చాలామంది చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఆ లిస్ట్ లో యంగ్ బ్యూటి .. ఉప్పెన ఫేం కృతిశెట్టి వచ్చి చేరింది. ఉప్పెన సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి జంటగా నటిస్తూ టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టికి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్ రెట్టింపు చేసుకునేలా నాని శ్యాం సింగ్ రాయ్.. సుధీర్ బాబు – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక త్వరలో ఉప్పెన సినిమా రిలీజ్ కాబోతోంది.
Ram charan : రామ్ చరణ్ అంటే క్రష్….. కృతిశెట్టి
ఈ నేపథ్యంలో కృతిశెట్టి ఉప్పెన ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొస్తోంది. అందులో భాగంగా తనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే క్రష్ అని … చరణ్ పక్కన నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయట పెట్టింది. ఇప్పటికే కృతిశెట్టి టాలీవుడ్ లో మేకర్స్ తో పాటు హీరోలను ఆకట్టుకుంది. కాబట్టి త్వరలో తన కోరిక తీరే అవకాశము కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసే సినిమాలో కృతిశెట్టికి ఛాన్స్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పవచ్చు.