మెగాస్టార్ చిరంజీవి తనయుడు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ అన్న క్రేజ్ ని సంపాదించుకున్న రాం చరణ్ ఇంత చిన్న వయసులో నిర్మాత అవుతాడని ఏ ఒక్కరు ఊహించలేదు. అది కూడా తన తండ్రి కోసమే ప్రత్యేకంగా బ్యానర్ ని స్థాపిస్తాడని ఎవరూ భావించనిది. అందుకు కారణం మొదటి నుంచి చిరంజీవి నటించే సినిమాలు ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లోనే తెరకెక్కాయి.
అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేస్తే నాన్న కోసం నేనే నిర్మాతగా మారతాను అని అన్నట్టుగానే చిరంజీవి రీ ఎంట్రీ మూవీతో రాం చరణ్ నిర్మాతగా మారాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థని కేవలం తన తండ్రి కోసమే స్థాపించి చిరంజీవి 150 మూవీ ఖైదీ నంబర్ 150, సైరా నరసింహా రెడ్డి సినిమాలను నిర్మించాడు.
ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే సైరా సినిమా విషయంలో రాం చరణ్ నిర్మాతగా చాలా విషయాఉ నేర్చుకున్నాడట. ముఖ్యంగా బడ్జెట్ కంట్రోల్ విషయంలో నిర్మాతదే ప్రధాన పాత్ర అన్న విషయం చరణ్ కి బాగా అర్థమైందట. లేదంటే ఊఉహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని సైరా నేర్పిందట. అందుకే ఆచార్య సినిమా నుంచి చరణ్ తండ్రి తో నిర్మించే ప్రతీ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఎటువంటి పరిస్థితుల్లోను సినిమా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని అలాగే బడ్జెట్ కంట్రోల్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడట.
ఇక మళయాళ సూపర్ హిట్ లూసీఫర్ ని తెలుగులో చిరంజీవి హీరోగా చరణ్ నిర్మిస్తున్నాడు. సాహో ఫేం సుజీత్ తెరకెక్కిస్తుండగా పొల్టికల్ బ్యా క్ డ్రాప్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నాడు రాం చరణ్. విజయదశమి కి ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుందని నవంబర్ లేదా డిసెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకువెళ్ళేందుకు రాం చరణ్ సన్నాహాలు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!