Ram charan – Mahesh babu: టాలీవుడ్లో ఇప్పుడు అన్నీ భారీ మల్టీస్టారర్ చిత్రాలే రూపొందుతున్నాయి. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే టాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్నారు. త్వరలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇలాంటి మల్టీస్టారర్ చిత్రాలు ఇంకా రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా మెగా అభిమానులకే కాదు అభిమానులందరికీ ఎంతో ప్రత్యేకం.
ఇక మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్లో రూపొదుతున్న సినిమాలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడు. ఇక ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ రూపొందుతోంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్లో మరో భారీ మల్టీస్టారర్కు సన్నాహాలు మొదలయ్యాయని తాజా సమాచారం. ఆ హీరోలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోలు.
Ram charan – Mahesh babu: ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడా..?
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నాడట. దర్శకుడు వంశీ పైడిపల్లి చరణ్ హీరోగా ఎవడు సినిమాను తెరకెక్కించాడు. అలాగే మహేశ్ బాబు హీరోగా మహర్షి సినిమాను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు భారీ హిట్ సాధించాయి. కాబట్టి ఈ మల్టీస్టారర్ త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలైతే అటు మహేశ్ అభిమానుల్లో ఇటు మెగా అభిమానుల్లో ఉండే అంచనాలు మరో లెవల్. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో.