మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందించి దాదాపు అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రీకరణలో ఉండగానే మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో నటించడానికి కమిటయ్యాడు.
రాజమౌళి అనుమతి తీసుకొని ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొనాలని అనుకున్న సమయంలో కరోనా కారణంగా చరణ్ అనుకున్న అన్ని ప్లాన్స్ తారుమారయ్యాయి. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక లాక్ డౌన్ లో కొంతమంది దర్శకులు స్టార్ హీరోల మధ్య కథా చర్చలు జరిగి వరుసగా తమ కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అందరూ చరణ్ చేయబోయో నెక్స్ట్ సినిమా గురించి చర్చలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే చరణ్ ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలోను చరణ్ సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడని న్యూస్ స్ప్రెడ్ అయింది.
వీటితో పాటు ‘భీష్మ’ డైరెక్టర్ వంశీ కుడుములు కి చరణ్ ఒకే చెప్పాడన్న వార్తలు మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా రూమర్స్ అని తెలుస్తుంది. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’, ‘ఆచార్య’ లో కీలక పాత్ర తప్ప మరే సినిమాని ఇప్పట్లో ఒప్పుకునే పరిస్థితులు లేవని అంటున్నారు. కరోనా కారణంగా తొందరపడకూడని నిర్ణయించుకున్నాడట చరణ్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?