గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ మధ్య చాలా ప్రచుర్యం పొందిన పేరు ఇది. దీన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. అలా స్టార్ట్ అయిన ఈ ఛాలెంట్ అటు రాజకీయ నాయకులను మొదలు, సినీ తారలను తాకింది. దాంతో రోజుకో యాక్టర్, రాజకీయ నాయకులు ఎక్కడో ఒక చోట మొక్కలను నాటుతున్నారు. అలాగే మొక్కల ప్రాముఖ్యతను నలుగురికి తెలిసేలా చేస్తున్నారు. అలాగే ఆ ఛాలెంజ్ ను పలువురికి విసురుతున్నారు.
ఇలాగే ప్రారంభమైన ఛాలెంజ్ ప్రభాస్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఆ ఛాలెంజ్ ను రామ్ చరణ్ కు విసిరిన విషయం కూడా తెలిసిందే. అయితే దాన్నిఇప్పుడు స్వీకరించాడు రామ్ చరణ్.. ఈ రోజు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్తో కలిసి మొక్కలను నాటాడు. అలాగే ఈ ఛాలెంజ్ ను రాజమౌళి, ఆలియా భట్ లకు విసిరాడు.
అయితే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని రామ్ చరణ్ తెలిపాడు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. దీన్ని దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ మొత్తానికి ఈ ఛాలెంజ్ ను విసురుతున్నానని తెలిపాడు. అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరాడు హీరో రామ్ చరణ్.
భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో మొక్కలను నాటుతున్నారు. అలాగే మొక్కల ప్రముఖ్యతను అందరికీ తెలిసేలా చేస్తున్నారు.అందులో ఇప్పుడు రామ్ చరణ్ కూడా చేరాడు.
అయతే రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ చిత్రం రూపొందుతోంది. దీనికీ రాజమౌళి దర్శకుడు. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించనున్నారు. అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి.