Acharya : చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాకు కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం ఇప్పటికే హైదరాబాద్ చివర్లో ఒక భారీ టెంపుల్ టౌన్ సెట్ వేశారు. మరొకవైపు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుగుతోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం మారేడుమిల్లి అడవుల్లో ఒక ప్రత్యేకమైన సెట్ వేశారు. అక్కడే రెండు మూడు నెలలు ఆపకుండా చిత్రీకరణ చేసి ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఇప్పుడు మారేడుమల్లి అడవుల్లో ‘పుష్ప’ సినిమాకోసం వేసిన సెట్ ను ‘ఆచార్య’ కోసం చరణ్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
‘ఆచార్య’ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘సిద్ధ’ అతని పాత్ర పేరు కాగా…. ఆ పాత్ర మీద ఎక్కువ భాగం షూటింగ్ అడవుల్లోనే చేయాల్సి వస్తుందని తెలిసిందే. ఇక దీని కోసం కొత్త సెట్ వేయడం ఎందుకని…. ఇప్పటికే ‘పుష్ప’ కోసం వేసిన సెట్ ను వాడుకోవాలని డిసైడ్ అయ్యాడట చరణ్.
ప్రస్తుతం ఆ సెట్లోనే చరణ్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అని సమాచారం. ‘పుష్ప’ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. మరి ఈ సెట్ ఉపయోగించుకోవడానికి రామ్ చరణ్ వారికి ఏమైనా పేమెంట్ ఇచ్చాడా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?