రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR , కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా లో ఎన్టీఆర్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాలతో అయితే తండ్రి చిరంజీవి మెయిన్ పాత్ర చేస్తుండగా దాదాపు నలభై నిమిషాల పాటు ఈ సినిమాలో చరణ్ కనిపించనున్నారు. ఇలాంటి తరుణంలో చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తమిళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ మోహన్ రాజా చెప్పిన స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ రాజా టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన “తని ఒరువన్” బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే సినిమా తెలుగులో ధ్రువ గా రీమేక్ అయ్యి.. తెలుగు ప్రేక్షకులను అలరించడం సూపర్ హిట్ గా నిలవడం జరిగింది.
ఇలా ఉండగా మోహన్ రాజా పాన్ ఇండియా తరహాలో ఓ స్క్రిప్ట్ రెడీ చేసి చరణ్ కి చెప్పటంతో…. స్క్రిప్ట్ చాలావరకు బాగుండటంతో చరణ్ ఓకే అన్నేసినట్లు టాక్. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు మొదలు కానుందని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినపడుతున్న లేటెస్ట్ టాక్. అదేవిధంగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.